ఇటీవలే ఆరిలోవ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ విషయంలో అసలైన నిందితులను పోలీసు లు అరెస్ట్ చేయకపోవడం అన్యాయం అని ప్రముఖ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుత రావు విచారం వ్యక్తం చేశారు. ఆరిలోవ లో గల దుర్గా బజార్ వద్ద గల అమర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ హత్య కేసులో
ఒక మహిలా నేత ప్రధాన నిందితురాలు కావడంతో పోలీసులు కావాలనే కేసు నిరుగారుస్తున్నరనీ ఆరోపించారు. అమర్ ను అతి దారుణంగా చంపారు. అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. హత్య కేసు నమోదు చేసినా, నిందితులు 12 మంది లో మీసాల విజయ లక్ష్మి, బాల కృష్ణ, భీశెట్టి, అప్పల రాజు, గోపి, ఇద్దరు మైనర్లు వున్నారు. ఈ కేసులో 11 మంది అరెస్ట్ చూపించారు. వాహనాలు స్వాధీనం చేసుకున్నారు అని తెలిపారు. అక్రమ సంబంధం వుందని, ఆమెతో గొడవ జరిగిందని ఆ క్రమంలో హత్య జరిగింది అని అంటున్నారు. అమర్ ట్రస్ట్ లో ఎన్నో కార్యక్రమాలు చేశాడని వివరించారు.. విజయ లక్ష్మి కి అమర్ కుటుంబం తో మంచి పరిచయం ఉందని దానిని ఆసరాగా తీసుకుని, అమర్ కుటుంబం వద్ద నుండి 50 తులాల బంగారం తీసుకుని తిరిగి ఇవ్వలేదు అన్నారు. యివతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అమర్ ద్వారా స్థానికంగా నివసిస్తున్న వారివద్ద నుండి సుమారుకోటిన్నర రూపాయలు వసూలు చేసింది అని వివరించారు.. దీనిపై స్థానికంగా ఉన్న యువత అమర్ పై తీవ్ర వత్తిడి తేవడం తో అమర్ విజయలక్ష్మి పై వత్తిడి తెచ్చాడని దాంతో కొంత సొమ్ము వాపస్ చేశారని చెప్పారు.. డబ్బు లావాదేవీల్లో ఇరు వర్గాలకు గొడవలు వున్నాయి అని తెలిపారు. సొమ్ము వాపస్ చేస్తానని చిన్న సేటిల్ మెంట్ ఉంది నీకు ఇవ్వాల్సిన నగదు ఇచ్చేస్తా నగదు కోసం రమ్మని చెప్పి అమర్ ను హత్య చేయడం జరిగిందని ఇది అంత తమకి పూర్తి ఆధారాలు ఉన్నాయని అచ్యుతరావు గుర్తు చేశారు.
కాబట్టి ఎఫ్ ఐ ఆర్ మొదట నమోదు చేసినట్టు కాకుండా ఎఫ్ ఐ ఆర్ లో కొన్ని మార్పులు చేయాలని బాధితులు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారన్నారు.మహిళల పక్షపాతి సి ఎం జగన్ ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కచ్చితంగా సీఎం జగన్ కలిసి ఆయన దృష్టికి తీసుకు వెళతాం స్పష్టం చేశారు... కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలని. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు హత్య జరిగి 9 రోజులు అయినా గాని పూర్తిస్థాయిలో అరెస్టు కాలేదని అనుమానం వ్యక్తం చేశారు.. అరెస్ట్ చేసినట్లు చెప్తున్న 11 మంది అరెస్ట్ మీద కూడా అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు. సదరు మహిళా నేతను వెంటనే అరెస్ట్ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తాము, అతని కుటుంబ సభ్యులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. ఈ ఘటన మీద
జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, దృష్టి కి తీసుకెళ్తామని వివరించారు..
ఆరి లోవా సి ఐ లకు కూడా ఫిర్యాదు చేసాము అని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా పెద్దల నుండి ఎంత వత్తిడి వచ్చిన సామాన్యులకు న్యాయం చేయడం ముఖ్యం అని అందుకే తను ఎంతవరకు అయిన పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని కంచర్ల హామీ ఇచ్చారు.. అంతకు ముందు అచ్యుత రావు అమర్ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించారు. మీడియా సమావేశంలో అమర్
తల్లి సత్యవతి, భార్య ఉమా, కుమార్తెలు దనుశ్రీ, మధుశ్రీ పాల్గొన్నారు.
ఈవిషయం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ అమర్ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు.