ఎంవీపీ కి చెందిన 65 సంవత్సరాల వయస్సు గల వృద్దురాలు తన ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తి అద్దె ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఈ వయస్సులో ఎటూ వెళ్లలేని పరిస్థితి న్యాయం చెయ్యమని ఫిర్యాదు చెయ్యటం జరిగింది.
🟤పేదవాల్తేరు కి చెందిన 64 సంవత్సరాల వయస్సు గల వృద్దుడు తన ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తి 8 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని న్యాయం చెయ్యమని ఫిర్యాదు చెయ్యటం జరిగింది.
🟤పేదవాల్తేరు కి చెందిన 63 సంవత్సరాల వయస్సు గల వృద్దురాలు తన భర్త సైబర్ ప్లాటుఫామ్ ద్వారా అసభ్యకరంగా మెసేజెస్ మరియు ఫోటోలు ఆమె యొక్క కాంటాక్టు నంబర్స్ కు పంపించి ఇబ్బంది పెడుతున్నారని న్యాయం చెయ్యమని ఫిర్యాదు చెయ్యటం జరిగింది.
🟤పేదవాల్తేరు కి చెందిన 75 సంవత్సరాల వయస్సు గల వృద్దుడు పీఎం పాలెం దగ్గర స్థలం కొనుక్కున్నారు ఇప్పుడు రెవిన్యూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయటం జరిగింది.
🟤పాండురంగ పురంకు చెందిన 87 సంవత్సరాల వయస్సు గల వృద్దుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో తన యొక్క పిర్యాదు ఫై చార్జిషీట్ ఫైల్ చేయాలనీ పిర్యాదు చేయటం జరిగింది.
🟤డాబాగార్డెన్స్ కి చెందిన 63 సంవత్సరాల వయస్సు గల వృద్దురాలు గంభీరం దగ్గర స్థలం కొనుక్కున్నారు ఇప్పుడు ఆ స్థలం వేరొకరు ఆక్రమించుకున్నారని పిర్యాదు చేయటం జరిగింది.
🟤గాజువాక కి చెందిన 57 సంవత్సరాల వయస్సు గల వృద్దుడు పాత గాజువాక బస్సు స్టాప్ వద్ద ఆటోవాళ్ళు ఆటోలను అడ్డాగా పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అదేవిధంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో ర్యాలీలు చేస్తున్నారని పిర్యాదు చేయటం జరిగింది.
🟤పెదగంట్యాడ కి చెందిన 73 సంవత్సరాల వయస్సు గల వృద్దుడు తన కుమారులు ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతున్నారని న్యాయం చెయ్యమని ఫిర్యాదు చెయ్యటం జరిగింది.
పోలీస్ కమిషనర్ గారు అన్ని కాల్స్ నూ పూర్తిగా పరిశీలించి వాటిని నిర్ణీత కాలంలో పరిష్కరించే దిశగా తగు ఆదేశాలను జారీ చేశారు.
గడిచిన మార్చ్ 15వ తేదీన జరిగిన "డయల్ యువర్ సి.పి" కార్యక్రమానికి 04 ఫిర్యాదులు రాగా, వాటిలో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లో వస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలగిస్తున్నారని మరియు ఫుట్ పాత్ లు ఆక్రమించి దుకాణాలు నడుపుతున్నారని వచ్చిన ఫిర్యాదులకు ఏ.సి.పి స్థాయి అధికారితో దర్యాప్తు చేయించి, ఆయా ప్రాంతాలను ప్రత్యేకముగా సందర్శించి, ప్రత్యామ్నాయ మార్గాలపై పలు ఆదేశాలు జారీ చేసి ఫిర్యాధులను పరిష్కరించారు, గత "డయల్ యువర్ సి.పి" కార్యక్రమానికి వచ్చిన 04 ఫిర్యాదులలో 03 ఫిర్యాదులు పరిష్కారం కాగా, 01 ఫిర్యాదుదారుల ఫిర్యాదులు సివిల్ పరిధిలో ఉన్నకారణముగా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని తెలియజేయడం జరిగినది.
డయల్ యువర్ సి.పి కార్యక్రమానికి ఈ 0891-2523408 నంబరుకు కాల్ చేసి నేరుగా మీ సమస్యలను నగర పోలీస్ కమిషనర్ డా. ఏ.రవి శంకర్ ఐ.పీ.ఎస్., గారికి తెలియజేయవచ్చు. అదేవిధంగా సిపి గారికి వాట్సాప్ ద్వారా ఫొటోస్, వీడియోస్ తో కూడిన ఫిర్యాధులు 9493336633 నంబరుకు ఇవ్వవచ్చు, అలాగే ప్రతీ సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ద్వారా కూడా ప్రజలు పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదులు ఇవ్వవచ్చు అని తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ. మంగపతి గారు మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి వి.శ్యామల గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.