కోటవురుట్ల లో మైనర్ అమ్మాయి వెంటపడి వేధించిన యువకుడు.
గుర్తుతెలియని వ్యక్తి తమ కూతురును వేదిస్తున్నాడని దిశ SOS కాల్ చేసిన తల్లిదండ్రులు.
మైనర్ అమ్మాయికి తరచూ ఫోన్ చేసి వేదిస్తున్న యువకుడు ప్రసాద్ గా గుర్తించిన పోలీసులు.
కోటవురుట్ల గ్రామంలోనే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న యువకుడు ప్రసాద్.
పోలీసుల సమక్షంలో ప్రసాద్ ను నిలదీసిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.
తానే ఫోన్ చేసి వేదించినట్లు పోలీసులు, పెద్దల సమక్షంలో ఒప్పుకున్న ప్రసాద్.
అమ్మాయి తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రసాద్ కు కౌన్సెలింగ్ ఇచ్చిన దిశ పోలీసులు.
మరొకసారి అమ్మాయిని వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రసాద్ ను హెచ్చరించిన దిశ పోలీసులు.