వన్డే హెచ్ఆర్ కాన్ఫరెన్స్ప్రారంభ సెషన్లో 26 ఏప్రిల్ 2024న, కమోడోర్ హేమంత్కత్రి, CMD, HSL, ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రారంభ సెషన్లో, "అసాధారణమైన సంస్థాగత సంస్కృతిని సృష్టించడం అద్భుతమైన HR అభ్యాసాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది" అని చెప్పారు.
హెచ్ఆర్ పద్ధతుల ద్వారా మనం అవలంబించే పరివర్తన మార్పుల ద్వారా 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన పునరుద్ఘాటించారు. మన లక్ష్యాలసాధనకు ‘సంస్కరణ, పనితీరు & పరివర్తన’ అనే మంత్రం మంచిదనిఆయన అన్నారు.
నేషనల్ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (NIPM)-విశాఖ చాప్టర్ RINL, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో కలిసి సంయుక్తంగాసెంట్రల్ రీజియన్ కింద ఈ HR కాన్ఫరెన్స్ను నిర్వహించింది. కాన్ఫరెన్స్యొక్క థీమ్ "HR అభ్యాసాల ద్వారా సంస్థ యొక్క రూపాంతరం - ఉద్యోగి అనుభవం ద్వారా మరియు ఉద్యోగుల కార్యోన్ముఖత ద్వారా ."
శ్రీS.C.పాండే, డైరెక్టర్ (పర్సనల్), RINL-VSP, మెంబర్ నేషనల్ కౌన్సిల్, NIPM మరియు CRC-2024 ఛైర్మన్ తన ప్రసంగంలో అర్థవంతమైనపరివర్తన కోసం ఈ సదస్సుద్వారా పరస్పర చర్యలు మరియు జ్ఞానాన్ని పంచుకునే అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
ఈరోజు ఇంత విలువైన హెచ్ఆర్ సెషన్నువిజయవంతంగా నిర్వహించినందుకు విశాఖ చాప్టర్, NIPM మరియు ఆర్ఐఎన్ఎల్లను వైలెడిక్టరీ ఫంక్షన్కు విశాఖపట్నం ముఖ్యఅతిథిగా వచ్చిన ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ఎం చంద్రశేఖర్ అభినందించారు.
కాన్ఫరెన్స్సెషన్లను పరిశ్రమ నిపుణులు,ప్రసిద్ధ విద్యావేత్తలు మరియు హెచ్ఆర్ ప్రొఫెషనల్స్నిర్వహించారు. సెయిల్, గెయిల్, ఎన్హెచ్పిసి,కోల్ ఇండియా, విపిటి, బ్రాండిక్స్, హెచ్ఎన్పిసిఎల్,సినర్జీస్ మరియు కోరమాండల్ ఫెర్టిలైజర్స్ మొదలైన వివిధ పబ్లిక్/ప్రైవేట్ ఆర్గనైజేషన్ల నుండి అనేకమంది హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ప్రతినిధులుగా సమావేశానికి హాజరయ్యారు.