దేశ బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు ఓటు
హక్కును వినియోగించుకోవాలని జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ ప్రజలకు పిలుపు
నిచ్చారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా “స్వీప్ ఏరినా పేరుతో” ఆదివారం సాయంత్రం
ఆర్.కె.బీచ్ రోడ్డులో విశ్వప్రియ ఫంక్షన్ హాలు ఎదురుగా గల పుట్ బాల్ గ్రౌండ్ నందు
ఏర్పాటు చేసిన “నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓటు ఫర్ స్యూర్” నినాదంతో ఓటరు చైతన్య
కార్యక్రమానికి విశాఖ తూర్పు శాసన సభ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి మరియు
జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తో కలిసి జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ
ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా జనరల్ అబ్జర్వర్ మోడల్ వి.వి.ఫ్యాడ్, మోడల్
పోలింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం సాండ్ ఆర్ట్ ను పరిశీలించారు. ఈ
సందర్భంగా జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ మాట్లాడుతూ దేశంలో ప్రజా స్వామ్య వ్యవస్థలో
ఇది ఒక పండగ లాంటిదని, ఇందులో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావడంతో పాటు
ఇతరులను కూడా చైతన్య పరచి దేశ భవిష్యత్తును బంగారమయం చేసేందుకు కృషి
చేయాలని అన్నారు. ఓటరు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, రాబోయే పది
రోజుల పాటు ఉంటుందని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వారి యొక్క ఓటు
హక్కు వివరాలను తెలుసుకోవాలన్నారు.
మే 13న జరిగే ఎన్నికల పండగకు సంబంధించి ఓటింగ్ శాతాన్ని
పెంపొందించేందుకు, ప్రజా స్వామ్య పరిరక్షణకు, ఓటరు చైతన్య కార్యక్రమాలైన తప్పెడు
గుళ్లు, విద్యార్దిని విద్యార్ధులతో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలను తిలకించారు.