విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతిలో మూడు రోజులు హరికథ ఉత్సవాల్లో మొదటి రోజున అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు గుమ్ములూరి, ట్రెజరర్ శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, నేటి భాగవతారిని జ్యోతి ప్రకాశం చేసి శుభారంభం చేశారు.
అధ్యక్షలు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ కళాభారతి అన్ని కళలను ప్రోత్సహించే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిందని అలాగే 38 సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సంవత్సరం హరికథ ఉత్సవాలు మూడు రోజులు ఏర్పాటు చేశామని అందరూ అధికంగా విచ్చేసి మన పురాతన కళలని ప్రోత్సహించాలని కోరారు.
తర్వాత జరిగిన హరికథ కాలక్షేపంలో శ్రీకృష్ణ రాయబారం హరికథని చక్కటి గానంతో చక్కటి కథతో అత్యంత అద్భుతంగా సాగింది.
కౌరవ పాండవులు చిన్నప్పటినుంచి కలిసిమెలిసి
విద్యాభ్యాసం చేసినప్పటికీ, దుర్యోధనుడు దుర్బుద్ధితో పాండవుల ఆస్తిని మాయ జూదంలో పూర్తిగా గెలుచుకొని పాండవులకు నిలువ నీడ లేకుండా చేస్తారు.
కురుక్షేత్ర సంగ్రామాన్ని జరగకుండా చూడాలని ఉద్దేశంతో పాండవులు ఐదుగురికి కనీసం ఐదు ఊర్లు ఇవ్వమని రాయబారాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నద్వారా పంపిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ వవార్తని కురురాజు దృతరాస్ట్రునికి నిండు సభలో తెలియజేస్తాడు. కానీ దుర్మార్గులైన దుర్యోధనుడు అందుకు అంగీకరించక కురుక్షేత్ర సంగ్రామమే రానిమ్మని యుద్ధంలో మేమే గెలుస్తామని శ్రీకృష్ణ పరమాత్మ ని అవమానించి పంపించేస్తారు.
ఈ ఘట్టాలన్నిటిని చక్కగా సంగీత కీర్తనలతో చక్కటి వచనంతో మంచి కంఠంతో భాగవతారిణి కథ చెప్పి అందరిని ఆకట్టుకున్నారు. ఇంతటి శ్రావ్యంగా చెప్పినందున అత్యధికంగా వచ్చిన ప్రేక్షకులందరూ కరతాల ధ్వనులతో కళాకారుణి ని అభినందించారు. హరికథ అందర్నీ ఆకట్టుకున్నందున హారతి పళ్ళెంలో అధికంగా విరాళం ఇచ్చి కళాకారులని ప్రోత్సహించారు.
కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరు రాంబాబు మాట్లాడుతూ రేపు ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ పురందరదాసు చరిత్ర హరికథ రూపంలో శ్రీ నారాయణాచార్యులుగా చెప్పనున్నారని
, సంగీతం నేర్చుకునే ప్రతి కరారులు లను కూడా వచ్చి పురందరదాసు చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉండదని ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని గురువులు శిష్యులు కూడా అధికంగా విచ్చేసి దాసు గారు చరిత్ర పూర్తిగా తెలుసుకోవలసిందిగా అందని ఆహ్వానించారు.